ఆరు గ్యారంటీలు అమలు చేయాలి

79చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 22న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కూసుమంచి మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. రుణమాఫీ అందరికీ రాలేదని, జీరో బిల్లులు కొందరికే వస్తున్నాయని, ఇళ్లు లేవుని, వ్యవసాయ కార్మికులకు పెన్షన్, భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్