నేలకొండపల్లిలో అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు

54చూసినవారు
నేలకొండపల్లిలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం పట్టణంలోని పలు దేవాలయాలకు చెందిన ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రజలు దర్శించుకునేందుకు జమ్మిబండ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ప్రజలు స్వామి విగ్రహాలను దర్శించుకున్నారు. పట్టణంలో ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు సందర్భంగా కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలకు వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్