ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

5143చూసినవారు
పినపాక మండలంలోని సీతారాంపురం శివారులో బీటీపీఎస్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా.. ఈ ఘటనలో ద్విచక్రంపై ఉన్న వారికి గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏడూళ్ళ బయ్యారం సీఐ కరుణాకర్, ఎస్ఐ వెంకటప్పయ్య ఘటనాస్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్