పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

693చూసినవారు
పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం మాజీ మంత్రి వర్యులు అల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సంభాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చిన నాయకులకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివ వేణు, పట్టణ అధ్యక్షుడు కొర్రపాటి సల్మాన్ రాజ్, కల్లూరు మండల అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్, తల్లడ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, పెనుబల్లి మండల అధ్యక్షుడు చెలికని రాజబాబు, వేంసూర్ మండల నాయకులు కాసరి చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి, లక్ష్మ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు గోళ్ల అప్పారావు, హాలవత్ వేంకటేశ్వరరావు, ఎంపిటిసి సభ్యురాలు హాలవత్ నాగ జ్యోతి, దేసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గారు మర్లపాడు ఎంపీటీసీ రాఘవ రెడ్డి, రెజర్ల సర్పంచ్ జక్కుల ప్రభాకర్, రాంప్రసాద్ రెడ్డి, ధరవత్ రామారావు, తోట రాజేష్, షేక్.రహిముతుల్లా జొన్నలగడ్డ శ్రీను, రామ్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, దామోదర్ రెడ్డి, కృష్ణవేణి, బాబు రావు, మెచ్చా రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you