కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామం కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప కామరాతి దేవాలయం తుమ్మలపల్లిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య సోమవారం రకరకాల మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి గొర్రెల మేకల పెంపకం దారుల సహకార సంఘం సెక్రటరీ చింతల లక్ష్మీనరసింహారావు, కురుమ యువ చైతన్య సమితి కార్యదర్శి జోగు విజయ తదితరులు పాల్గొన్నారు.