ఐపీఎల్ 2025 భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన KKR జట్టు 16.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. KKR బ్యాటర్లలో రఘువంశీ 26 రమణ్దీప్ సింగ్ (22), మనీశ్ పాండే (19) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లు తీయగా దీపక్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య, విఘ్నేశ్ పుతుర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.