గ్రామపంచాయతీ కార్మికుడిగా మారిన కాలనివాసుడు

2918చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసుడు కొట్రాంగే సంపత్ మంగళవారం గ్రామపంచాయతీ సఫాయి కార్మికుడి అవతారం ఎత్తాడు. ఇందుకు సంబంధించి తను మాట్లాడుతూ.. తన సమీపంలో ఉన్న మురికి కాలువ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. పారిశుధ్యం లోపించిందని పారిశుద్ధ్య కార్మికులు నెలకొకసారి వస్తున్నారని వాపోయారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్