అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

51చూసినవారు
రెబ్బెన మండలం తక్కలపల్లి బస్టాండ్ సమీపంలో సోమవారం పశువులను పట్టుకున్నట్లు రెబ్బెన సిఐ చిట్టిబాబు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ కు తరలిస్తున్న పశువులు వ్యాన్ ఎకో బ్రిడ్జి వద్ద నిలిపి ఉండగా గమనించిన పోలీసులు ఆ వ్యాన్‌ను పట్టుకున్నారు. ఎవరైనా అక్రమంగా పశువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్