జిల్లా ఎస్పీని కలిసిన బెల్లంపల్లి ఏరియా జిఎం

63చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన బెల్లంపల్లి ఏరియా జిఎం
కొమురంభీం జిల్లా ఎస్పీగా ఇటీవలే బాద్యతలు స్వీకరించిన శ్రీనివాస రావును సింగరేణి జీఎం డి రవిప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి మొక్కను బహూకరించారు. బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తి, పరిసర ప్రాంతాల అభివృద్ది కోసం పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎస్జీఎస్వీ వరప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్