పాఠ్యపుస్తకాల విక్రయదారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
పాఠ్యపుస్తకాల విక్రయదారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కొమురం భీం జిల్లాలో పాఠ్యపుస్తకాల విక్రయాల అనుమతి కోసం ఆసక్తి ఉన్న దుకాణదారుల నుంచి ఈనెల 15లోగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఒ పీ. అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే వారు ఈ ఏడాదికి సంబంధించిన వ్యాట్ లైసెన్సు, టర్నోవర్ టాక్స్, ఆడిట్ రిపోర్టు, గత నాలుగేళ్ల జీఎస్టీ ధ్రువీకరణతో పాటు డీఈవో కుమురం భీం పేరిట తీసిన రూ. 2 వేల విలువ చేసే డీడీని దరఖాస్తుతో పాటు సమర్పించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్