పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది

71చూసినవారు
పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది
కొమురం భీం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పదోన్నతి పొందిన పలువురు జిల్లా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో ఉద్యోగం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. ఇదే విధంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, మరిన్ని పదోన్నతులు పొందుతూ జిల్లాకు, వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్