పలువురు వడ్డీ వ్యాపారులపై కేసు

59చూసినవారు
పలువురు వడ్డీ వ్యాపారులపై కేసు
కాగజ్నగర్ పట్టణంలోని అనుమతులు లేకుండా చీటీల వ్యాపారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్చ్ఓ శంకరయ్య గురువారం తెలిపారు. పట్టణంలోని సురేందర్ సితాని నివాసంలో తనిఖీలు చేయగా. 10 నాన్ జ్యుడిషియల్ బాండ్లు, నాలుగు బ్లాంక్ చెక్లు, రూ. 1, 43, 250 నగదు లభించిందని, జగల్ కిషోర్ నివాసంలో తనిఖీలు చేయగా రూ. 28 లక్షల నగదు లభించినట్లు చెప్పారు. ఎలాంటి పత్రాలు లేని ఈ నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్