కాగజ్నగర్ మండలం విలేజ్ నెంబర్ 5, 12 కు చెందిన ఇద్దరు జవాన్లు హవాల్దార్ గోకుల్ మిస్త్రీ, హవాల్దార్ ధనుంజయ్ సర్కార్ బాంగుళూరు ఏఎస్ సీలో విధులు నిర్వహిస్తూ ఎప్రిల్ 30 న రిటైర్ అవ్వడం జరిగింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నా ఎక్స్ ప్రెస్ లో కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు వారిద్దరూ విచ్చేసిన సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వారిని పూలమాలలతో సత్కరించి వారి గ్రామం వరకు ఊరేగింపుగా వెళ్ళారు.