కోడి పంధాలపై పోలీసుల మెరుపుదాడి
8మందిపై కేసు నమోదు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో కోడి పందాల స్థావరాలపై చింతలమానేపల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కోడి పందాలు ఆడుతున్న 8మందిని పట్టుకుని వారివద్ద నుండి 5 కోడి పుంజులు, 5 కత్తులు, 2120 రూపాయలు స్వాధినపరుచుకుని 8మందిపై కేసు నమోదు చేసినట్లు చింతలమనేపల్లి ఎస్ఐ ఐ నరేష్ వెల్లడించారు.