ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

65చూసినవారు
ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో ఆర్డినేటర్ వెంకటేశం డిమాండ్ చేశారు. పేపర్ మిల్లులో రాచరిక వ్యవస్థ నిర్వహిస్తూ కార్మికులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మిల్లు యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్