ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం అదృష్టం అని కొమురంభీం జిల్లా ఇన్చార్జ్, మంత్రి సితక్క అన్నారు. శనివారం కాగజ్నగర్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సీతక్క సందర్శించారు. భోజనం చేసేందుకు వచ్చిన ప్రయాణికులకు భోజనం వడ్డన చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్, తదితరులున్నారు.