కాగజ్నగర్ పట్టణానికి చెందిన విజయ అనే మహిళ తన రియల్ మీ మొబైల్ను ఇటీవల పోగొట్టుకుని ఈస్గాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ రమన్ కుమార్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్ చేసి మంగళవారం బాదితురాలికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ మొబైల్ పోయిన లేదా దొంగిలించబడినా వెంటనే సిఇఐ ఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేస్తే మొబైల్ ట్రేస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు.