కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రైల్వే కాలనీలో గల రామ మందిరంలో బుధవారం రామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుప పండువగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నవమి ఉత్సవాలను తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు మెయిన్ మార్కెట్, సర్దార్ బస్తి, మారుతి నగర్ నుండి భక్తులు విశేషంగా తరలివస్తారు. వచ్చిన భక్తులకు బెల్లం పానకం ఇవ్వడం ఇక్కడ ఆనవాయతి.