ఆమ్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉండటంతో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి సునీత అందుకోనున్నారు. స్టార్ క్యాంపెనర్ల లిస్ట్లో సునీతకు పార్టీ తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్లో మే 7న జరిగే లోక్సభ ఎన్నికలకు సునీత ప్రచారం చేయనున్నారు. పొత్తులో భాగంగా భావ్నగర్, భారుచ్ స్థానాల్లో ఆప్.. మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి.