పేపర్ మిల్ లో అగ్నిప్రమాదం

20014చూసినవారు
అశ్వారావుపేటలోని పేపర్ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఫ్యాక్టరీ వెనుక భాగంలో వేస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఎగసి పడుతున్న మంటలు చూసి చుట్టుపక్కల నివాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఎట్టకేలకు ఫ్యాక్టరీ సిబ్బంది మంటలు అదుపుచేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకంగా జరిగిన అనుభవమున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టి సారించడం లేదని స్థానికులు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్