బీహార్లోని పట్నా సాహిబ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. అక్కడి నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ను రంగంలోకి దించింది. అయితే పట్నా సాహిబ్ లోక్సభ స్థానం బీజేపీకి కంచుకోట. ప్రస్తుతం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా
బీజేపీ అభ్యర్థులే ఇక్కడ గెలిచారు.