చతిస్గడ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ప్రైవేట్ బస్సు
చర్ల సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా ఖాఫ్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఒక ప్రెవేట్ బస్సు లోయలో పడిన సంఘటనలో 14 మంది మృతి చెందారు. సుమారు 30 ఆ బస్సులో ఉండగా, మిగతా వారికి తీవ్ర గాయ్యాలయ్యాయి. చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరందరూ కేడియా డిస్టలరీ కంపెని ఉద్యోగులని తెలిసింది. మృతులకు బుధవారం పీఎం మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.