మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా

73చూసినవారు
కొత్తగూడెం పట్టణంలోని నిరుపేదలకు 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసి వెన్నెల నగర్ ను ఏర్పాటు చేసింది. స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం తమకు కనీస మౌలిక సదుపాయాలు అయిన మంచినీరు, కరెంట్, డ్రైనేజ్ తదితర సదుపాయాలు కల్పించకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహించిన కాలనీ వాసులు కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్