పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందించిన జిల్లా ఎస్పీ

558చూసినవారు
పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందించిన జిల్లా ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన ఏఎస్సై బి. కృష్ణ కుటుంబానికి, కొమరారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం. సైదేశ్వరరావు కుటుంబానికి, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి. శ్రీదేవి కుటుంబానికి 8, 00, 000/- రూపాయల చెక్కులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం అందించారు.

సంబంధిత పోస్ట్