ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

82చూసినవారు
ఉపాధ్యాయుడు వేణు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోక్సో కేసు నమోదు కావడంతో సింగరేణి యాజమాన్యం ఆయన్ను విధుల్లోంచి సస్పెండ్ చేసినట్లు జనరల్ మేనేజర్ ఎడ్యుకేషన్ బి. నికోలస్ తెలిపారు. విద్యార్థినుల భద్రత పరంగా యాజమాన్యం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నట్లు జీఎం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్