బైక్ను ఢీకొన్న టిప్పర్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
అశ్వాపురం మండలంలో ఇసుక లోడ్తో వెళ్తున్న టిప్పర్ బైక్ను ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అశ్వాపురం మండలం కేంద్రంలోని కాలనీ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. చవిటిగూడెంకు చెందిన బుర్ర ఉప్పయ్య తన బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇసుక టిప్పర్ ఉప్పయ్య బైక్ను ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.