మణుగూరు మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను డీఎంహెచ్వో భాస్కర్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆయా ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను డీఎంహెచ్వో పరిశీలించారు. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాలను సీజ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో హెచ్చరించారు.