పండితాపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

83చూసినవారు
పండితాపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
కామేపల్లి మండలం పండితాపురం గ్రామ శివారులో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు గణపతి బొట్ల మధు సూదన్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్