ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

55చూసినవారు
ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2024 - 25 విద్యా సంవత్సరంలో జరుగుతున్న అడ్మిషన్లుకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. రెగ్యులర్ గా బడికి, కళాశాలకు వెళ్ళలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తెలిపారు. ఎక్స్ ఎంపిటీసి మండల రాము, పునేం సురేందర్, కాకతీయ ఓపెన్ సెంటర్ కోఆర్డినేటర్ డి. రామచందర్, ఎం. రమేష్ గౌడ్ వై. రాజేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్