AP: వైసీపీ మద్దతుదారుడు, నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ వచ్చింది. కర్నూలు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. పోసాని బెయిల్ పిటిషన్పై 5 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. రూ. 20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని అరెస్టైన విషయం తెలిసిందే.