కువైట్ ప్రమాద ఘటనలో మృతి చెందినవారిలో ఎక్కువగా కేరళ, తమిళనాడుకు చెందినవారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. బాధితుల్లో ఎక్కువగా మలయాళీలు ఉన్నారని.. వారికి తక్షణమే సహాయం అందించాలని కోరారు.