కువైట్ అగ్ని ప్రమాదం.. స్పందించిన పీఎం మోదీ

75చూసినవారు
కువైట్ అగ్ని ప్రమాదం.. స్పందించిన పీఎం మోదీ
కువైట్ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను వెంటనే కువైట్ వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈనెల 13న కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్