మాల్దీవుల్లో మారుతున్న పరిణామాలను
భారత్ మొదటి నుంచే నిశితంగా గమనిస్తోంది. పర్యాటకంగా మాల్దీవులకు చెక్ పెట్టాలనే ఆలోచన ఉందో? లేదో? గానీ.. లక్షద్వీప్ను మాత్రం అభివృద్ధి చేయాలని ఏడాదిన్నర క్రితమే మోడీ సర్కార్ నిర్ణయించింది. లక్షద్వీప్ చుట్టూ సముద్రమే. పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే పర్యాటకుల అవసరాలు తీర్చేంత నీటి లభ్యత అవసరం. దీనికోసం ఇజ్రాయెల్ను
భారత్ సంప్రదించింది. ప్రస్తుతం లక్షద్వీప్లో ఇజ్రాయెల్ బృందం డిశాలినేషన్ ప్రోగ్రాం చేపడుతోంది.