సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళదాం: పవన్‌ కల్యాణ్

51చూసినవారు
ఏపీలో ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తిని ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అద్భుత మెజార్టీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందన్నారు. ‘‘కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించాం. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారు. అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకువెళ్లాలి’’ అని పవన్‌‌కల్యాణ్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్