పుట్టబోయే బిడ్డ ఆడపిల్లనా మగ పిలగాడ తెలుసుకోవడానికి భార్య (8నెలల ప్రెగ్నెంట్) పొట్ట కోసిన భర్తకు యూపీ కోర్టు జీవితఖైదు విధించింది. బదౌన్కు చెందిన పన్నాలాల్, అనిత దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. అనిత మళ్లీ గర్భం దాల్చిందని, ఈసారి మగబిడ్డను కనాలని అనితతో భర్త గొడవ పడ్డాడు. దీంతో అతను రాక్షసుడిలా ప్రవర్తించి లోపల ఎవరున్నారో అని భార్య పొట్ట కోశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే లోపల ఉన్న మగబిడ్డ చనిపోయాడు.