ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎంఎస్ ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో ధోనీ 11 బంతుల్లో 26 పరుగులు చేశారు. కీలక సమయంలో దూబేతో కలిసి ధోనీ మ్యాచ్ను చెన్నై వైపు తిప్పి విజయాన్ని అందించారు.