ఆటో, కారు, బైక్ ఢీ.. పలువురికి గాయాలు

18736చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలంలోని గుడిబండ గ్రామ స్టేజీ వద్ద బుధవారం జాతీయ రహదారి (44) పై ప్రమాదవశాత్తు ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు, బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్