సీసీ టీవీలు నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ నేరాల తగ్గింపులో దోహదపడతాయని జోగులాంబ గద్వాల ఎస్పీ రితిరాజ్ అన్నారు. మానవపాడు మండలం పల్లెపాడులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12 సీసీ టీవీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాలకు కులం మతం వర్గం బేధం లేకుండా అన్ని వర్గాల కార్యకలాపాలను క్యాప్చర్ చేసి పుటేజ్ విడుదల చేస్తుందన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా అవసరమని ఎస్పి తెలిపారు.