ధరూరు మండలంలో వ్యవసాయ మోటార్ల కేబుల్ చోరీ కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు మోటార్ల కేబులు చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. జాంపల్లి శివారులోని నెట్టెంపాడు ప్రధాన కాల్వ వెంట రైతులు అమర్చుకున్న వ్యవసాయ మోటార్ల కేబుల్ ను శుక్రవారం దుండగులు చోరీ చేశారు. దాదాపు 40 మంది రైతులకు చెందిన కేబుల్ ను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.