గద్వాలలో కూలిపోయిన డ్రైనేజ్

73చూసినవారు
గద్వాలలో కూలిపోయిన డ్రైనేజ్
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజ వీధి సాయిబాబా ఆలయం ఎదురుగా వున్న డ్రైనేజ్ కూలిపోయింది. రాత్రి సమయంలో అధిక లోడుతో ఉన్న గుర్తు తెలియని వాహనం రావడంతో డ్రైనేజ్ కూలిపోయినట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజ్ కి మరమ్మతులు చేయాల్సిందిగా ఆదివారం వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.