
ఉగ్ర వేట కొనసాగుతోంది: భారత సైన్యం
జమ్మూకశ్మీర్ లోని షోపియన్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా ఆర్మీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారని పేర్కొంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారని వెల్లడించింది. దీని ఫలితంగా ముగ్గురు హార్డ్ కోర్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతుల్లో హతమయ్యారని పేర్కొంది.