గద్వాల పశువుల సంతలో నీటి కొరత

67చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి సోమవారం జరిగే పశువుల సంతలో మనుషులకు, పశువులకు తాగునీటి ఎద్దడి నెలకొందని సంతకు వచ్చిన రైతులు తమ గోడును వెలిబుచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉండగా పశువుల సంతను రోడ్డు బయటనే నిర్వహిస్తున్నారని రైతులు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్