బదిలీ అయినా ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

78చూసినవారు
బదిలీ అయినా ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి
జోగులాంబ గద్వాల జిల్లాలో 2024లో బదిలీ అయ్యి ఇంకా కొత్త పాఠశాలలో చేరని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఆదివారం టిటియూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బదిలీ అయిన ఉద్యోగులకు ఎల్పిసి ఇవ్వకపోవడం, రిలీవ్ చేయకపోవడం వల్ల బదిలీ అయిన ఆనందం కూడా లేకుండా పోయిందని నాయకులు మండిపడ్డారు. తక్షణమే పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎస్జీటీలు వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్