తల్లీకూతుళ్లను అభినందించిన సీఐ అప్పయ్య

83చూసినవారు
తల్లీకూతుళ్లను అభినందించిన సీఐ అప్పయ్య
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 1వ పోలీస్ స్టేషన్ లో జయమ్మ అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూతురు అఖిల మంగళవారం 10 వ తరగతి పరీక్షలలో 10/10 పాయింట్స్ సాధించింది. ఈ సందర్భంగా సిఐ అప్పయ్య వారిద్దరిని శాలువాతో సన్మానించి అభినందించారు. అలాగే రానున్న కాలంలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగం సాధించాలని ఆ విద్యార్థిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనయ్య, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్