గోవర్ధన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

79చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం వెంట పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ గుర్నాథ్ రెడ్డి, సోదరుడు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్