ఇంటి కూల్చివేత.. బోరున ఏడ్చిన వికలాంగ కుటుంబం

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి గ్రామంలో గురువారం అధికారులు బుల్డోజర్లతో సుమారు 75ఇళ్లను కూల్చివేయించారు. అందులో వికలాంగులకు చెందిన 25 ఇళ్లు ఉన్నాయి. తాము ఆసుపత్రిలో ఉండగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇల్లు కూల్చివేశారని, తనకు ఇద్దరు ఆడపిల్లలున్నారని దివ్యాంగుడైన ఆ ఇంటి యజమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రిని చూసి స్కూల్ యూనిఫామ్ లో చిన్నారి సైతం బోరున ఏడవడం అందర్నీ కలిచివేసింది.

సంబంధిత పోస్ట్