యువత క్రీడల్లో రాణించాలి: ఎస్సై మాధవ రెడ్డి

67చూసినవారు
యువత  క్రీడల్లో రాణించాలి: ఎస్సై మాధవ రెడ్డి
క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కల్వకుర్తి ఎస్ఐ మాధవ రెడ్డి అన్నారు. సోమవారం సీబీఎం కాలేజ్ క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ జూనియర్ సౌత్ జోన్ జిల్లా ఎంపికలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 19, 20 తేదీలలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ గ్రౌండ్ లో జరగబోయే పోటీలలో పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్