స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లోగో ఆవిష్కరనలో మాజీ ఎంపీ ఏపీ

65చూసినవారు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తివంతంగా ఉందని సీఎం అభినందించారు. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, శాట్ ఎండీ సోనీ బాలాదేవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్