![పీయూలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ పీయూలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్](https://media.getlokalapp.com/cache/9d/10/9d10291b8c79544b03eac28b9fce6d82.webp)
పీయూలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో రూ. 42. 40 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించగా ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 3. 25 కోట్లతో కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.