ఈనెల 29న బిజెపి ఎంపి అభ్యర్థి డికె అరుణ రాక

1571చూసినవారు
ఈనెల 29న బిజెపి ఎంపి అభ్యర్థి డికె అరుణ రాక
ఈనెల 29న నారాయణపేట జిల్లా ఉమ్మడి మాగనూరు మండలంలో నిర్వహించనున్న బిజెపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ రానున్నట్లు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఉమ్మడి మాగనూరు మండలంలోని ముడుమాల్, మురహార్ దొడ్డి గ్రామాలలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా నాయకులు మజ్జిగ సురేష్, నల్లే నరసప్ప పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్